కేటీఆర్ ను కలిసిన జివి రామకృష్ణరావు

కేటీఆర్ ను కలిసిన జివి రామకృష్ణరావు

కరీంనగర్ జిల్లా : మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ నూతన అధ్యక్షుడు జివి రామకృష్ణ రావుతో కలిసి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిశారు. సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షునిగా జివి రామకృష్ణారావును నియమించిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం మంత్రి గంగుల నూతన అధ్యక్షునితో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా కేటీఆర్ నూతన అధ్యక్షునికి అభినందనలు తెలియజేశారు, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమర్థుడైన మంత్రి గంగుల కమలాకర్ అండగా ఉన్నారని కేటీఆర్ అన్నారు. సుశిక్షితులైన కార్యకర్తలతో కరీంనగర్ గులాబీ సేన పటిష్టంగా ఉందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ కోసం మరింత తీవ్రంగా శ్రమించి అప్రతిహత విజయాల్ని అందుకోవాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని కేటీఆర్ కి విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ నిరంతరం కరీంనగర్ కు అండగా ఉన్నారని టీఆర్ఎస్ ప్రభుత్వంలో కరీంనగర్ అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ నూతన అధ్యక్షులు జీవి రామకృష్ణ రావు, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఒడితల సతీష్, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు