కామ్రేడ్ మల్లు స్వరాజ్యం జీవిత విశేషాలు

కామ్రేడ్ మల్లు స్వరాజ్యం జీవిత విశేషాలు

వరంగల్ టైమ్స్, నల్లగొండ జిల్లా : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం కరివిరాల కొత్తగూడెం గ్రామంలో భూస్వామ్య కుటుంబంలో భీమిరెడ్డి రామిరెడ్డి చొక్కమ్మ దంపతులకు 1931వ సంవత్సరంలో మల్లు స్వరాజ్యం జన్మించారు. వీరికి వందలాది ఎకరాల భూమి కలదు. వీరిది భూస్వామ్య కుటుంబం. దీంతో 1945-1946 వ సంవత్సరంలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో నైజాం సర్కారును గడగడలాడించారు. 1947- 46 వ సంవత్సరంలో స్వరాజ్యం ఇంటిని నైజాం గుండాలు దాడులకు పాల్పడ్డారు. మల్లు స్వరాజ్యం తెలంగాణ సాయుధ పోరాటంలో ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలో పని చేశారు. నాడు దొరల దురహంకారాన్ని పాటల ద్వారా చైతన్య పరిచారు.కామ్రేడ్ మల్లు స్వరాజ్యం జీవిత విశేషాలుమహిళా కమాండర్ గా మల్లు స్వరాజ్యం..
మహిళ కమాండర్ గా పని చేశారు. అప్పటి నైజాం ప్రభుత్వం మల్లు స్వరాజ్యంని పట్టిస్తే రూ.పదివేల బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఆంధ్ర మహాసభ పిలుపుతో తన పొలంలో పండిన వరి ధాన్యాన్ని పేదలకు పంచి పెట్టారు. వీరి భర్త మల్లు వెంకటనర్సింహారెడ్డి సీపీఎం కేంద్ర కమిటీ సభ్యునిగా, ఉమ్మడి నల్గొండ జిల్లా కార్యదర్శిగా సుదీర్ఘకాలం పని చేశారు.

రాజకీయ నేపథ్యం..
వీరి సోదరులు భీమిరెడ్డి నరసింహారెడ్డి అప్పటి మిర్యాలగూడ పార్లమెంటు నుండి రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు. 1978 నుండి 1983 వరకు మొదటి దఫా, రెండవ దఫా 1983 నుండి 84 వరకు రెండోసారి ఎమ్మెల్యేగా సీపీఎం పార్టీ తరపున పనిచేశారు. మిర్యాలగూడ పార్లమెంటుకు పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మద్యపాన వ్యతిరేక పోరాటంలో మల్లు స్వరాజ్యం ప్రముఖ పాత్ర పోషించారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకురాలిగా పనిచేశారు. నా గొంతే తుపాకీ తూటా పేరుతో మల్లు స్వరాజ్యం ఆత్మకథ కూడా ప్రచురితమైంది.కామ్రేడ్ మల్లు స్వరాజ్యం జీవిత విశేషాలు

మల్లు స్వరాజ్యం కుటుంబం..
మల్లు స్వరాజ్యంకి ఒక కూతురు, ఇద్దరు కుమారులు. కూతురు పేరు పాదూరి కరుణ. ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుని పేరు మల్లు గౌతమ్ రెడ్డి, చిన్న కుమారుని పేరు మల్లు నాగార్జున రెడ్డి. పెద్ద కుమారుడు మల్లు గౌతమ్ రెడ్డికి ఒక కూతురు, ఒక కూతురు కలదు. చిన్న కొడుకు మల్లు నాగార్జున రెడ్డికి ఇద్దరు కుమారులు కలరు. చిన్న కోడలు మల్లు లక్ష్మి గత పార్లమెంట్ ఎన్నికలు నల్గొండ ఎంపీగా పోటీ చేశారు. పెద్ద కుమారుడు మల్లు గౌతంరెడ్డి సీపీఎం పార్టీ నల్గొండ జిల్లా కమిటీ సభ్యునిగా పని చేస్తున్నారు. చిన్న కుమారుడు మల్లు నాగార్జున్ రెడ్డి సీపీఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శి గా పని చేస్తున్నారు.