బల్దియా ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు: సీపీ సజ్జనార్​

బల్దియా ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు: సీపీ సజ్జనార్​హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు. తప్పడు ప్రచారాలు, సోషల్​ మీడియాలో పోస్టులపై నిఘా పెట్టినట్లు వివరించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. మంగళవారం జరిగే బల్దియా పోలింగ్‌కు 13,500 మంది సిబ్బందితో బందోబస్తు కల్పిస్తున్నట్లు చెప్పారు. వీరిలో 10,500 సివిల్, 3000 మంది ఏఆర్​ సిబ్బంది ఉంటారన్నారు. పోలీస్​ సిబ్బందికి మూడు సార్లు తర్ఫీదు ఇచ్చినట్లు వివరించారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం అన్ని ప్రాంతాల్లో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ స్పష్టం చేశారు. రేపు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుందని ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. కోవిడ్ నియమ నిబంధనలు పాటించి ఓటింగ్ లో పాల్గొనాలని సైబరాబాద్​ సీపీ సజ్జనార్​ సూచించారు.

బందోబస్తులో ఉన్న పోలీస్​ సిబ్బంది వివరాలు..

– నార్మల్, సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్, క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద ఎస్సై , సీఐ స్థాయి అధికారి, ఏసీపీ, ఏడీసీపీ, డీసీపీల నేతృత్వంలో భద్రత ఏర్పాటు.
– 38 స్ట్రైకింగ్ ఫోర్స్, 11 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, 9 సీపీ రిజర్వ్ టీమ్స్, 11 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 11 స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్ లు అందుబాటులో ఉంటారు.
– 73 హైపర్ సెన్సిటివ్ పికెట్ లు నియమించి కట్టుదిట్టమైన భద్రత.
– హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల వద్ద 1 ఎస్సై, 4 గురు ఏఆర్ సిబ్బంది నియమించాము.
– సైబరాబాద్ కమిషనరేట్ లో 38 వార్డులు ఉన్నాయి
– 2437 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి.
– 1421 నార్మల్ పోలింగ్ స్టేషన్ లు ఉన్నాయి.
– 766 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ లు ఉన్నాయి.
– 250 అత్యంత సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ లు ఉన్నాయి.
– 177 మొబైల్ పార్టీలతో నిరంతరం మానిటరింగ్ చేస్తున్నాము.
– సైబరాబాద్ లో 15 బార్డర్ చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశాం.
– హైపర్ సెన్సిటివ్ ఏరియా ల్లో 73 పికెట్ లు ఏర్పాటు చేశాం.
– 587 లైసెన్సేడ్ గన్స్ డిపాజిట్ చేశాం
– 369 మంది రౌడీ షీటర్ లను బైండోవర్ చేశాం.
– రూ. 15 లక్షలు విలువ చేసే 396 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నాం
– ప్రతి పోలింగ్​ స్టేషన్ కు జియో ట్యాగింగ్ ఏర్పాటు
– పెండింగ్ లో ఉన్న 24 మంది పై నాన్ బెయిబుల్ వారెంటిలు ఎక్జి క్యూట్ చేశాం.
– సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద సీసీటీవీ లు ఏర్పాటు చేసి వాటిని ఎలక్ట్రానిక్ ప్లాట్ ఫామ్ ద్వారా అనుసంధానం చేశాం.
– జియో ట్యాగింగ్ ద్వారా పోలింగ్ కేంద్రాన్ని అనుసంధానం చేసాము.
– 1 లక్ష సీసీ కెమెరాలు ద్వారా సమస్యాత్మక ప్రాంతాలను మానిటరింగ్ చేస్తున్నాము.
– డీసీపీ, ఏసీపీ ఆఫీస్ లో రౌండ్ ది క్లాక్ నిరంతర పర్యవేక్షణ ఉంచాము.
– ఎన్నికల అనంతరం లైవ్ స్ట్రీమింగ్ ద్వారా స్ట్రాంగ్ రూమ్ వద్ద నిఘా ఉంచాము.
– ఎలక్షన్ ఏజెంట్ కి ప్రత్యేక వాహనం అనుమతి ఉండదు.
– పోలింగ్ కేంద్రాల నుంచి 200 మీటర్ ల వద్ద ఓటర్ లు తమ వాహనాలు పార్క్ చేసుకోవాలి.
– ఓటర్లను తరలించడం చట్ట విరుద్ధం అలా చేస్తే వాహనాలు సీజ్ చేస్తామని సైబరాబాద్​ సీపీ సజ్జనార్​ హెచ్చరించారు.