న్యూఢిల్లీ: మాజీ నేషనల్ చాంపియన్ భారత్ బాక్సర్ దుర్యోదన్ నేగి కరోనా బారిన పడ్డారు. అయితే ఆయనలో వ్యాధి లక్షణాలు ఏమీ లేవని అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా దవాఖానలో చేర్పించామని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది. పాటియాలాలోని జాతీయ శిక్షణా కేంద్రంలో శిక్షణ తీసుకుంటున్న నేగి ఇటీవల దీపావళి పండుగకు సెలవుపై ఇంటికి వెళ్లాడు. తిరిగి వచ్చిన తరువాత ఆయనను క్వారంటైన్లో ఉంచి కోవిడ్ టెస్ట్ చేయగా వైరస్ సోకిందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన కొలంబియా ఏసియా దవాఖానలో వైద్య చికిత్స పొందుతున్నారని వారు తెలిపారు.