ఎంసెట్ లో ఇంటర్ మార్కుల వెయిటేజీ రద్దు 

ఎంసెట్ లో ఇంటర్ మార్కుల వెయిటేజీ రద్దు

వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్: ఎంసెట్ లో ఇంటర్ మార్కుల వెయిటేజీని రద్దు చేస్తూ తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం కూడా ఎంసెట్ ర్యాంకుల ఆధారంగానే ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించింది. ఇంటర్ లో కనీస మార్కులు సాధించాలన్న నిబంధనను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో ఇంటర్ లో జనరల్ విద్యార్థులు 45 శాతం, రిజర్వ్ డ్ క్యాటగిరీ విద్యార్థులు 40 శాతం మార్కులు సాధిస్తేనే ఎంసెట్ కు హాజరుకావొచ్చని సూచించింది.

కరోనా ప్రభావం కారణంగా మూడేండ్లుగా ఎంసెట్ లో ఇంటర్ వెయిటేజీ నుంచి మినహాయింపు ఇచ్చారు. తాజాగా ఈ యేడాది విద్యాసంవత్సరం ఇంటర్ వెయిటేజీ అంశంపై ఉన్నత విద్యామండలి అధికారులు నిపుణుల కమిటీ వేశారు. ఈ కమిటీ జేఈఈ సహా ఇతర రాష్ట్రాలను అనుసరిస్తూ ఈ యేడాది కూడా వెయిటేజీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను ఆమోదించడంతో శుక్రవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.