ఈ అక్క చెల్లెలు కాబోయే కలెక్టర్లు

న్యూఢిల్లీ: తండ్రి అడుగుజాడల్లో నడిచి ఆయన మార్గదర్శనంలో అక్కాచెల్లెలు సివిల్స్ లో విజయకేతనం ఎగురవేశారు.రెండు రోజుల క్రితం ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో ఒకే ఇంటి నుంచి ఈ అక్కాచెల్లెలు ఎంపికకాగా.. రాజస్థాన్ లోని ఒక మండలం నుంచి మరో ఇద్దరు యువకులు కూడా సివిల్స్ సాధించారు.ఈ అక్క చెల్లెలు కాబోయే కలెక్టర్లుతమిళనాడుకు చెందిన ఐఏఎస్ అధికారి అయిన రమేశ్ చంద్ర మీనా.. తన కుటుంబంతో చెన్నైలో నివసిస్తున్నారు. ఈయనకు ఇద్దరు కుమార్తెలు.రెండు రోజుల క్రితం ప్రకటిచించిన సివిల్స్ ఫలితాల్లో అక్క అనామిక 116 వ ర్యాంకు సాధించగా.. చెల్లె అంజలి కి 494 ర్యాంకు వచ్చింది. తండ్రి బాటలో నడిచి సమాజసేవకు అంకితమయ్యేందుకు సివిల్స్ ను ఎంచుకున్నామని, మహిళలు, చిన్నారుల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేయాలని పెట్టుకున్నామని చెప్పారు. ఇలాఉండగా, రాజస్థాన్ లోని శికరాయి సబ్ డివిజన్ కు చెందిన అరవింద్ కుమార్ మీనా కూడా సివిల్స్ సాధించారు. అరవింద్ 676 ర్యాంకు వచ్చింది. చిన్ననాటనే తండ్రి చనిపోవడంతో తల్లి సజ్జన్ దేవీ రెక్కల కష్టంపై ఉన్నత చదువులు చదివాడు. మట్టిగుడిసెలో నివసించిన ఈ మాణిక్యం సివిల్స్ సాధించడంపై శికరాయి వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సశస్త్ర సీమా బల్లో అసిస్టెంట్ కమాండెంట్ గా విధులు నిర్వర్తిస్తున్న తాను ఐఏఎస్ సాధించాలన్న లక్ష్యంతో చదివినట్లు అరవింద్ కుమార్ మీనా చెప్పారు.