క్రిస్మస్ విషెష్ చెప్పిన ఏపీ సీఎం

క్రిస్మస్ విషెష్ చెప్పిన ఏపీ సీఎంకడప జిల్లా : దైవ కుమారుడు జీసస్‌ మానవుడిగా జన్మించిన రోజును ప్రపంచమంతా క్రిస్మస్‌గా జరుపుకుంటుందని, క్రిస్మస్‌ అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదని, అది మనిషిని నిరంతరం సన్మార్గంలో నడిపించే దైవికమైన ఒక భావన అని ఏపీ సీఎం వైఎస్ జగన్‌ అన్నారు. దుర్మార్గం నుంచి సన్మార్గానికి, అమానుషత్వం నుంచి మానవత్వానికి, చెడు నుంచి మంచికి, దురాశ నుంచి దాతృత్వం–త్యాగాలకు జీసస్‌ తన జీవితం ద్వారా బాటలు వేశారని జగన్‌ తెలిపారు.

సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, ఆకాశమంత సహనం, అవధులు లేని త్యాగం, శాంతియుత సహజీవనం, శత్రువుల పట్ల సైతం క్షమాగుణం… ఇవీ జీసస్‌ తన జీవితం ద్వారా మనకు ఇచ్చిన సందేశాలని సీఎం పేర్కొన్నారు. అనంతరం క్రిస్మస్‌ సందర్భంగా అందరికీ తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.