ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్హైదరాబాద్ : స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమయ్యింది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. 5 జిల్లాల్లోని 6 స్థానాలకు 26 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 37 పోలింగ్ కేంద్రాల్లో, 5,326 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

స్థానిక సంస్థల కోటాలో కరీంనగర్ జిల్లాలో 2 స్థానాలకు, ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్ , నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరుగుతున్నది. పోలింగ్ ప్రక్రియను వెబ్ క్యాస్టింగ్ చేస్తున్నారు. ఈ నెల 14న ఓట్లు లెక్కించనున్నారు.