చిల్లర రాజకీయాలు మానుకోండి : ఎర్రబెల్లి

చిల్లర రాజకీయాలు మానుకోండి : ఎర్రబెల్లి

చిల్లర రాజకీయాలు మానుకోండి : ఎర్రబెల్లివరంగల్ టైమ్స్, యాదాద్రి భువనగిరి జిల్లా : ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దుయ్యబట్టారు. చిల్లర రాజకీయాలతో దేవాలయాలను సైతం అపవిత్రం చేస్తున్నారని, ఈ విధానాన్ని ప్రతిపక్షాలు మానుకోవాలని ఆయన హెచ్చరించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి తో కలిసి శనివారం సందర్శించారు.ఈ సందర్భంగా దేవాలయంలో పూజలు నిర్వహించారు.స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  మాట్లాడారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారు తమ ఇలవేల్పు అని తెలిపారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందన్నారు.చిల్లర రాజకీయాలు మానుకోండి : ఎర్రబెల్లిఏప్రిల్ 30న సెక్రటేరియట్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కెసిఆర్ ఆ భవనం నుండి మంచి పాలన అందించాలని దేవుడిని కోరుకున్నట్లు తెలిపారు. అలాగే సీఎం కేసీఆర్ దార్శనికతతో రాష్ట్రం అన్ని రంగాల్లో మరింతగా అభివృద్ధి చెందాలని ఆ దేవుడిని ప్రార్థించానని మంత్రి చెప్పారు.ఆ దేవుడు ఆశీస్సులతో ప్రజలంతా సుఖ శాంతులతో ఉండాలని కోరుకున్నానని దయాకర్ రావు తెలిపారు.ప్రతిపక్షాలు చీటికి మాటికి దేవాలయాల పేర్లు చెప్పి,సందర్శించి చిల్లర రాజకీయాలు చేస్తూ దేవాలయాలను అపవిత్రం చేస్తున్నారని ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. ప్రజలు ప్రతీ ఒక్కటి చూస్తున్నారు.

సరైన సమయంలో మంచి గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు.కాగా,సీఎం కేసీఆర్ స్ఫూర్తితో తాను తన పాలకుర్తి నియోజకవర్గంలోని పలు దేవాలయాలను అభివృద్ధి పరుస్తున్నట్లుగా మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. అంతకు ముందు మంత్రికి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డికి ఆలయ అధికారులు,అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు.దర్శనానంతరం అర్చకులు మంత్రికి,ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డికి స్వామి వారి పట్టు వస్త్రాలతో ఆశీర్వచనం అందించారు.