నేడు ఆ ఫైల్ పైనే కేటీఆర్ తొలి సంతకం

నేడు ఆ ఫైల్ పైనే కేటీఆర్ తొలి సంతకం

నేడు ఆ ఫైల్ పైనే కేటీఆర్ తొలి సంతకం

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో లక్ష మందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ మార్గదర్శకాల ఫైలు పై నూతన సచివాలయంలో మంత్రి కేటీఆర్ తొలి సంతకం చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయం ఆదివారం ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 1గంటల తర్వాత సీఎం కేసీఆర్, మంత్రులు తమకు కేటాయించిన చాంబర్లలో ఆసీనులు కానున్నారు. ఈ సందర్భంగా సీఎం, మంత్రులు పలు ఫైల్స్ (దస్త్రాల)పై సంతకాలు చేయనున్నారు. నూతన సచివాలయం 3వ అంతస్తులోని కార్యాలయం నుంచి మంత్రి కేటీఆర్ ఇకనుంచి తన విధులను నిర్వర్తించనున్నారు. ఈ సందర్భంగా అత్యంత కీలక దస్త్రంపై మంత్రి కేటీఆర్ తొలి సంతకం చేయనున్నారు. హైదరాబాద్ నగరంలోని జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న లక్ష డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపు ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాల దస్త్రంపై తొలి సంతకం చేయనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు.