చంద్రబాబుతో పవన్ భేటీ..దాని కోసమేనా!

చంద్రబాబుతో పవన్ భేటీ..దాని కోసమేనా!

చంద్రబాబుతో పవన్ భేటీ..దాని కోసమేనా!

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ లోని చంద్రబాబు నాయుడు నివాసానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెళ్లిన నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ మధ్య కాలంలో జరిగిన మూడో భేటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులు, ప్రజాసమస్యలు, తాజీ రాజకీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. రాజకీయంగా పొత్తు పెట్టుకోవడంతో పాటు వైఎస్సార్సీపీ సర్కార్ వైఫల్యాలపై కలిసి పోరాడే అవకాశాలపై కీలక చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇటీవల ఢిల్లీలో పవన్ కల్యాణ్ తో భేటీ అయిన తర్వాత జనసేన అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. అధికార వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా టీడీపీ, బీజేపీ, జనసేనలు ఏకమై పోరాడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. అయితే ఇప్పుడు చంద్రబాబుతో పవన్ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారడంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తుపై అంచనాలు మరింత పెరిగాయి.