పోలవరంలో కీలకమైన ఘట్టానికి చేరిన పనులు

గడ్డర్ల ఏర్పాటుతో వరదలు వచ్చినా అడ్డంకులు లేకుండా పనులు

అప్పట్లో అంతా గ్రాఫిక్స్‌ మాయాజాలం. ఇప్పుడు ఎక్కడ చూసినా పనుల వేగం. చంద్రబాబు హయాంలో పోలవరంలో గ్రాఫిక్స్‌ వరద పారింది. ఇప్పుడు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ప్లానింగ్‌తో ప్రాజెక్ట్‌ పనులు వరదలా పరుగులు పెడుతున్నాయి. ఒక్కో దశలను దాటుకుంటూ కీలక ఘట్టానికి చేరుకున్నాయి. ప్రపంచంలో తొలిసారిగా పోలవరంలో తొలిసారిగా భారీ గేట్లను చురుగ్గా ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. అరుదైన హైడ్రాలిక్ వ్యవస్థ ద్వారా గేట్లు పనిచేసే విధనాన్ని ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. హైడ్రాలిక్ పద్ధతిలో గేట్లు పనిచేయడం ప్రపంచంలోనే ప్రత్యేకమైనది. ఈ పద్ధతిలో గేట్లు ఏర్పాటు చేసేందుకు అవసరమైన గిడ్డర్ల బిగింపు ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. ఇందుకోసం సోమవారం పూజలు నిర్వహించి సూచన ప్రాయంగా పనులు ప్రారంభించారు. ఈ రోజు నుంచి మొత్తం గిడ్డర్ల ప్రక్రియ మొదలైంది. వీటిని ఏర్పాటు చేసిన తరువాత హైడ్రాలిక్ పద్ధతిలో పనిచేసే గేట్లను బిగిస్తారు. దీనివల్ల వరదలు వచ్చినా రాకపోయినా గేట్ల నిర్వహణ చాలా సులభంగా ఉంటుంది. మామూలుగనైతే ఎలక్ట్రోమెకానికల్ గేట్లనుఎత్తడం దించడం చేస్తారు. మన రాష్ర్టాల్లోని రిజర్వాయర్లన్నింటికి ఇదే పద్ధతి ఉంది. దీనివల్ల నిర్వాహణ చాలా వ్యయంతో కూడుకున్నది. అలాగే ఐరన్ రోప్ (ఇనుప తాళ్లు) తరచు మార్పు చేయాల్సి రావడం లేకపోతే బిగుసుకుపోయి గేట్లు వరదల సమయంలో సరిగ్గా పనిచేయకపోవడం జరుగుతూ ఉంటుంది. కానీ పోలవరం ఈ సమస్య ఎదురుకాకుండా హైడ్రాలిక్ గేట్ల వ్యవస్థను మేఘా ఇంజనీరింగ్ ఏర్పాటు చేస్తోంది.

పోలవరంలో కీలకమైన ఘట్టానికి చేరిన పనులు

ప్రపంచంలోనే అతిపెద్ద గడ్డర్లు

స్పిల్‌ వే పనులు ఊపందుకుని దానికి ఓ రూపం వచ్చింది. ఈ పనుల్లో మరో ముఖ్యమైన పనికి సిద్దమైంది మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ. స్పిల్‌వేకి గడ్డర్లు, స్పిల్‌వే పియర్స్‌ మార్చటాన్ని మొదలు పెట్టింది. ఏ జలాశయంలోనైనా ఇది ఎంతో కీలమైంది. అందులోనూ పోలవరానికి గడ్డర్ల అమరికకు మరెంతో ప్రాముఖ్యత ఉంది. ప్రపంచంలోనే అతి పెద్ద స్పిల్‌వే పోలవరం ప్రాజెక్ట్‌లోనే ఉంది. ఈ జలాశయంలో గడ్డర్లు కూడా ప్రపంచంలో ఇంతవరకూ ఏ ప్రాజెక్టులోనూ లేని స్ధాయిలో పెద్దవి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. జలాశయ స్విల్‌వేలో ఇది కీలకమైన అంకం. గతంలో మాదిరిగా అక్కడ గ్రాఫిక్స్‌ ప్రదర్శించడం లేదు. ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టిన మేఘా సంస్థ ఎనిమిది నెలల కాలంలోనే పనుల్లో ఎంతో ప్రగతి చూపించింది. గోదావరి వరద ప్రవాహంలాగ నిర్మాణాన్ని చకచకా సాగిస్తోంది.

గడ్డర్ల ఏర్పాట్లు ప్రారంభం స్పిల్‌వేలోని గేట్లను పెట్టేందుకు సంబంధించిన పని మొదలుకావాలంటే తొలుత ఇంటర్నల్‌ ఎంబెడెడ్‌ పార్టుల నిర్మాణ సమయంలో అమర్చటంతోపాటు గడ్డర్లను బిగించాలి. ఈ పనికి ఇప్పుడు అంకురార్పణ జరిగింది. అన్ని గేట్లకు (48) సంబంధించిన గడ్డర్ల బిగింపు పని 45-46 బ్లాకులోని గేటు ప్రాంతంలో మేఘా సంస్థ, నిపుణుల పర్యవేక్షణలో అమర్చడం మొదలైంది. ఒక్కో గడ్డర్‌ సామర్థ్యం 62 టన్నులు. కాబట్టే ఇది అత్యంత క్లిష్టమైన, కీలకమైన పని.

పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తి కావాలనే ప్రజల చిరకాల కోరిక తీరే దిశగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షలకు తగిన విధంగా మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్ఫాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) నిర్మాణ పనుల వైపు వేగంగా అడుగులు వేయిస్తోంది. ప్రాజెక్ట్‌ స్పిల్‌ వే లోని 52 బ్లాక్స్‌ కు సంబందించిన పియర్స్‌ నిర్మాణం పూర్తి కావచ్చింది.

క్లిష్లమైన పని అలవోకగా..

స్పిల్‌వే పియర్స్‌పై గడ్డర్లు ఏర్పాటు చేస్తే స్పిల్‌ ఛానల్‌ పనులలో సింహ భాగం పూర్తయినట్లే. ఎంఈఐఎల్‌ పోలవరం ప్రాజెక్ట్‌ పనులు చేపట్టే సమయానికి పియర్స్‌ పనులు వివిధ స్థాయిల్లో ఉన్నాయి. ప్రస్తుతం ఇవి 52 మీటర్ల ఎత్తుకు చేరుకున్నాయి. బల్లపరుపు నేలపై కాంక్రీట్ వేయటం, రికార్డులు సాధించటం పెద్ద గొప్ప కాదు. ఇరుకైన పియర్స్ పై కాంక్రీటింగ్, అదీ బహుళార్ధసాధక ప్రాజెక్ట్ నియమ నిబంధనలకు అనుగుణంగా చేయటమనేది క్లిష్టమైంది. అంతటి క్లిష్టమైన పనిని కూడా మేఘా అలవోకగా చేస్తోంది. స్పిల్‌వే మొత్తం దూరం రెండు కిలమీటర్లు. ఇది ప్రపంచంలోనే పెద్దది. ఇంతవరకూ చైనాలోని త్రీ గార్జెస్‌ డ్యాంలో 47 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహించే విధంగా నిర్మిస్తే ఇక్కడ 50 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహించే విధంగా నిర్మిస్తున్నారు. ఇక్కడ స్పిల్‌వే గురించి సంక్షిప్తంగా తెలుసుకోవాలి. అప్పుడే గడ్డర్ల ప్రాముఖ్యత తెలుస్తుంది. జలాశయంలో నీటిని నిల్వ చేసి వరద వచ్చినప్పుడు కిందకు విడుదల చేసేందుకు (జల నిర్వహణ మరియు వరద నియంత్రణ) ఉపయోగపడేదే స్పిల్‌వే. ఆ విధంగా స్పిల్‌వే పనిచేయాలంటే గేట్ల నిర్వహణ ముఖ్యమైనది. వాటిపై హాయిస్ట్‌ వ్యవస్థను ఏర్పాటు చేసి తద్వారా గేట్లను నియంత్రిస్తారు.

ఔరా ఏమా… గడ్డర్లు

పోలవరం స్పిల్‌వే పియర్స్‌ పై 196 గడ్డెర్లను ఏర్పాటు చేస్తారు. ఒక్కో గడ్దర్‌ బరువు 62 టన్నులు. ఇప్పటికే 110 గడ్డర్లు స్పిల్‌ వే పై ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాయి. కేవలం రెండు నెలల్లో వీటిని సిద్ధం చేశారు. మిగిలిన వాటిని సిద్ధం చేస్తున్నారు. ఒక్కో గడ్దర్‌ తయారీకి 25 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌, 10 టన్నుల స్టీల్ ను వినియోగించారు. మొత్తం 196 టన్నులకు 1960 టన్నుల స్టీల్ ఉపయోగించనున్నారు.

ఈ రోడ్‌ నిర్మాణానికి సుమారు ఐదు వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ అవసరం అవుతుంది. ఈ పనులన్నీ పూర్తి అయితే గేట్ల బిగింపు మినహా మిగిలిన ప్రధాన పనులన్నీ పూర్తయినట్లే. అంటే స్పిల్‌ వే పనులు దాదాపు పూర్తి అయినట్లే. స్పిల్‌ వేలో ఒక వైపు గడ్డెర్లను ఏర్పాటు చేస్తూనే మిగిలిన పనులు చేసుకునేందుకు ఎలాంటి ఆటంకం రాకుండా మేఘా సంస్థ చర్యలు తీసుకుంటోంది. గడ్డెర్ల ఏర్పాటుకు రెండొందల టన్నుల బరువు మోసే క్రేన్‌ను వినియోగిస్తున్నారు. ఒక్కో గడ్దర్‌ రెండు మీటర్ల ఎత్తు ఉంటుంది. గడ్డెర్ల ఏర్పాటు, రోడ్‌ నిర్మాణం పూర్తయితే గోదావరికి ఎంత వరద వచ్చినా గ్యాప్‌ 1, 3, ఎర్త్‌ కం రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ (గ్యాప్‌ 2) పనులు నిరాటంకంగా చేసుకోవచ్చు.

మేఘా సంస్థ జూన్‌ చివరి నాటికి స్పిల్‌ వే లో 1. 41 లక్షల క్యూబిక్‌ మీటర్లు, స్పిల్‌ ఛానల్‌ లో 1,11 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పని, జల విద్యుత్‌ కేంద్రం ఫౌండేషన్‌ లో 3. 10 లక్షల క్యూబిక్‌ మీటర్లు, మట్టి తీసే పని 10. 64 లక్షల క్యూబిక్‌ మీటర్లు, రాయి తొలిచే పనులు 1.14 లక్షల క్యూబిక్‌ మీటర్లు, వైబ్రో కంప్యాక్షన్‌ పనులు 10. 86 లక్షల క్యూబిక్‌ మీటర్లు పని చేసింది. నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా పనులు జరుగుతున్నాయని, అనుకున్న సమయానికి ప్రాజెక్ట్‌ పనులు పూర్తి చేస్తామనే ధృడమైన విశ్వాసంతో మేఘ సంస్థ ముందుకు వెళుతోంది. పోలవరం బహుళార్ధ సాధక ప్రాజెక్టును 7.2 లక్షల ఎగరాలకు సాగునీరు, 960 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి, 80 టీఎంసీల గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజ్‌ ఎగువన కృష్ణా నదికి తరలించటం, 23.44 టీఎంసీల నీటిని విశాఖ నగర తాగునీటి అవసరాలకు తరలించటం, 540 గ్రామాల్లోని 28.5 లక్షల మంది ప్రజల దాహార్తిని తీర్చేందుకు నిర్మిస్తున్నారు. ఇందులో ఇప్పుడు మేఘా చేస్తున్న పనుల చాలా ముఖ్యమైనవి. అవి మిగిలిన స్పిల్‌ వే పూర్తిచేయటంతోపాట, ఎర్త్ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యాం(ఈసీఆర్‌ఎఫ్‌), అనుబంధ పనులు, జల విద్యుత్‌ కేంద్రం నిర్మాణం, ఎగువ దిగువ కాఫర్‌ డ్యాం పూర్తిచేయటం.

నాడు వైఎస్‌ – నేడు జగన్‌

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు నాటి ముఖ్యమంత్రి, దివంగత నేత రాజశేఖరెడ్డి చొరవతో 2005లో మొదలయ్యాయి. రాష్ర్ట విభజన సందర్భంగా ఈ ప్రాజెక్ట్ను కేంద్రం జాతీయ ప్రాజ్టెక్ట్ గా ప్రకటించింది. దేశంలో 23 జాతీయ ప్రాజెక్టులను ఇప్పటివరకూ నిర్మించారు. ఇందులో కొన్నింటిని నిర్మిస్తున్నారు. ఏ ప్రాజెక్టునైనా జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించాక నిర్మాణ ఖర్చు మొత్తాన్ని కేంద్రమే భరించాలి. అయితే టిడిపి అప్పటికే పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నాం ఇపుడే అధికారంలోకి వచ్చాం ఎంత అందితే అంత నొక్కేయాలని నిర్ణయానికి వచ్చిన టీడీపీ పోలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నిధులతో చేపట్టేలాగ అనుమతులు సాధించుకుంది. నాటి సిఎం చంద్రబాబు 30 విడతలు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించారు. 90 విడతలు సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. సోమవారాన్ని పోలవారంగా మార్చి హడావిడి చేశారు. 2018లో తొలి పంటకు నీరిస్తామని, రాసుకోండి అని నాటి శాసనసభలోనే ప్రజలకు స్పష్టమైన హామీనిచ్చారు. అయితే ఈ ప్రాజెక్టు పనులు మూడు అడుగుల ముందుకు ఆరు అడుగుల వెనక్కు అన్నట్లుగా సాగాయి. ఎన్నికల సమయంలో ప్రధాని మోడి పోలవరం తెలుగుదేశం పార్టీ నేతలకు ఏటీఎంలా మారిందని ఆరోపించారు.