మార్చి 7 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

మార్చి 7 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : మార్చి 7 నుంచి రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కాగా రాష్ట్ర బడ్జెట్ కు ఆమోదం తెల్పేందుకు మార్చి 6 సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. మార్చి 7న ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ను ప్రవేశపెడతారు. సభ ఎన్నిరోజులు జరగాలనేది బీఎసీ సమావేశంలో నిర్ణయిస్తారు.మార్చి 7 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు