రంజీ ట్రోఫీలో హైదరాబాద్ ఓటమి

రంజీ ట్రోఫీలో హైదరాబాద్ ఓటమి

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో హైదరాబాద్ కు పరాజయం తప్పలేదు. బెంగాల్ తో జరిగిన పోరులో హైదరాబాద్ 72 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 239 రన్స్ లక్ష్యాన్ని ఛేదించేందుకు, ఓవర్ నైట్ స్కోర్ 16/3 తో ఆదివారం ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ చివరకు 166 పరుగులకు ఆలౌటైంది.రంజీ ట్రోఫీలో హైదరాబాద్ ఓటమి

ఠాకూర్ తిలక్ వర్మ ( 90 ; 9 ఫోర్లు, ఒక సిక్సర్ ) ఒంటరి పోరాటం చేశాడు. బెంగాల్ బౌలర్లలో ఆకాశ్ దీప్ 4, షాబాజ్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టారు. బెంగాల్ తొలి ఇన్నింగ్స్ లో 242 పరుగులు చేయగా, హైదరాబాద్ 205 రన్స్ కు పరిమితమైంది. అనంతరం బెంగాల్ రెండో ఇన్నింగ్స్ లో 201 పరుగులు చేసి హైదరాబాద్ కు 239 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన విషయం తెలిసిందే. ఆల్ రౌండ్ ప్రదర్శనలతో ఆకట్టుకున్న షాబాజ్ కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.