నదిలో కారు బోల్తా.. 9 మంది సజీవ సమాధి

వరంగల్ టైమ్స్, ఇంటర్నెట్ డెస్క్ : రాజస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. కోటా వద్ద కారు అదుపుతప్పి నదిలో పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న 9 మంది సజీవ సమాధి అయ్యారు. 9 మంది ఓ కారులో ఉజ్జయినీలో జరుగుతున్న వివాహ వేడుకకు వెళ్తున్నారు. ఈ క్రమంలో కోట వద్ద చంబల్ నది దాటుతుండగా అదుపుతప్పి అందులో పడిపోయింది. దీంతో అందులో ఉన్న 9 మంది మృతి చెందారు.సమాచారం అందుకున్న పోలీసులు, జిల్లా యంత్రాంగం ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్ సహాయంతో కారును నదిలో నుంచి బయటకు తీశారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.