పోలవరంలో దొరికిన చంద్రబాబు.. ఇంత మోసమా?

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చీకటి వ్యవహారాలు ఒక్కటొక్కటిగా వెలుగుచూస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు చంద్రబాబు అవినీతి కథలు ఒక్కటొక్కటిగా వెలుగుచూస్తున్నాయట.. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పోలవరంపై క్యాబినేట్ తీర్మానం చేసి మరీ ప్రాజెక్టులోకి అవినీతికి ఆస్కారం కల్పించారు. ఈ ప్రాజెక్టును ఏటీఎంల వాడుకోని వేలకోట్ల అవినీతికి పాల్పడిన బాబు నిందలను మాత్రం జగన్మోహన్ రెడ్డి సర్కార్ వేస్తోంది.

2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా నాడు ఏపీకి వచ్చిన ప్రధాని మోడీ చంద్రబాబు అవినీతిపై ఆరోపణలు గుప్పించారు. ‘పోలవరం ప్రాజెక్టును నాటి సీఎం ఒక ఏటీఎంలా వాడుకుంటున్నారు. ప్రాజెక్ట్ ను అడ్డం పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు డ్రా చేస్తున్నారని’ విమర్శలు గుప్పించారు. అయితే వీటిని చాలామంది రాజకీయ ఆరోపణల్లో భాగంగా కొట్టిపారేశారు. కానీ ఆ ఆరోపణల్లో నిజం ఉందని రాష్ట్ర ప్రభుత్వ రికార్డులే స్పష్టం చేస్తున్నాయి.

పోలవరంలో దొరికిన చంద్రబాబు.. ఇంత మోసమా?

బాబు సీఎంగా ఉన్న సమయంలో ప్రాజెక్ట్ పనుల్లో వ్యయాన్ని ఏకంగా మూడువేల కోట్ల రూపాయలకు పెంచినట్లు ఆధారాలున్నాయి. ఆ పనులన్నీంటిని నాటి ప్రభుత్వం నామినేషన్ పద్ధతిలో అప్పగించింది. దీనిద్వారా ఇంతవరకు ఎప్పుడూ, ఎక్కడా జరుగనటువంటి అవినీతికి నాటి క్యాబినేట్ తీర్మానం ద్వారాలు తెరిచింది. 2015 అక్టోబర్లో నాటి రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలే అద్దం పడుతున్నాయి.

నాటి కాంట్రాక్టర్లు సరిగ్గా, సక్రమంగా పనులు చేయలేకపోతున్నారని.. అందుకు ఆర్థికపరమైన అవరోధాలతోపాటు ఇంజనీరింగ్ శక్తి సామర్థ్యాలు లేకపోవడమే కారణంగా చూపించింది. తమవారికి నేరుగా పని కల్పించేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి ఆధారాలను పరిశీలిస్తే నాడు ప్రధాని చేసిన ఆరోపణ నిజంగా ఉందనేది అర్థమవుతోంది.

నాటి ప్రభుత్వం ఆదేశాల మేరకు అధికారులు ఆ ప్రతిపాదనను రూపొందించగా క్యాబినెట్లో ఆమోదించి పనులను తమవారికి అప్పగించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఐదేళ్లపాటు పనులు చేసిన ఆయనకు, ఆయనకు సంబంధించిన వారికి ఇంజనీరింగ్ సంస్థలు ఏమాత్రం పనులు చేయకపోగా ఖజానాను మాత్రం ఖాళీ చేశారు. నాడు చంద్రబాబు నాయుడి క్యాబినేట్ చేసిన తీర్మానాలే అవినీతికి ఆస్కారం కల్పించిందనే వాదనలు విన్పిస్తున్నాయి.

డ్రాప్ట్ మెమోరాండం ఫర్ ది కౌన్సిల్ ఆఫ్ మినిష్టర్స్.. పేరుతో నీటి పారుదలశాఖ (ప్రాజెక్ట్-1) సమర్పించిన నివేదికలోని అంశాలు పరిశీలిస్తే పోలవరంలో నాటి ప్రభుత్వం ఎలా అవినీతికి పాల్పడిందో అర్థమవుతుంది. అయితే ఆ తర్వాత 2016 సెప్టెంబర్‌ 7 అర్ధరాత్రి రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన ప్రత్యేక సహాయానికి చంద్రబాబు అంగీకరించారు. దాని అమలుకు సంబంధించి 2016 సెప్టెంబర్‌ 30న కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన మెమోరాండంలోనూ 2014 ఏప్రిల్‌ 1నాటి ధరల ప్రకారం నీటిపారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే ఇస్తామని స్పష్టం చేసింది.

ఇదే అంశంపై 2017 మార్చి 15న కేంద్ర కేబినెట్‌ తీర్మానం చేసింది. ఆ కేబినెట్‌లో టీడీపీ నుంచి ఇద్దరు మంత్రులు అశోక గజపతి రాజు, సుజనా చౌదరి ఉన్నారు. ప్రాజెక్టుకు అన్యాయం జరుగుతుంటే వారు ఎందుకు అడ్డుకోలేకపోయారని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఆ తర్వాత కేంద్ర కేబినెట్‌ తీర్మానం బ్రహ్మాండంగా ఉందంటూ 2017మార్చి 17న అసెంబ్లీ, మండలిలో ప్రశంసించిన చంద్రబాబును కొన్ని పత్రికలు బాకాలు ఊదాయి.

ఈ కేబినెట్‌ తీర్మానాన్ని ఎత్తిచూపుతూ 2013-14 ధరల ప్రకారం ప్రాజెక్టుకు నీటి పారుదల విభాగం వ్యయం రూ.20,398.61 కోట్లుగా నిర్ధారించి, ఆమోదిస్తే రూ.2,234.77 కోట్లను రీయింబర్స్‌ చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ ఇటీవల కొర్రీ వేసింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) సవరించిన అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం ఎంతో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆరుసార్లు కోరింది. దీనికి సమాధానం చెప్పకుండా నాటి ప్రభుత్వం జాప్యం చేస్తూ వెళ్లింది.

2017 మార్చి 15న కేంద్ర కేబినెట్‌ ఆమోదించిన తీర్మానంలో సగభాగం అసెంబ్లీలో చదివిన చంద్రబాబు.. పోలవరం ప్రాజెక్టు శరవేగంగా పూర్తి చేస్తామని ప్రకటించారు. ఆ సందర్భంగా శాసనమండలిలో అప్పటి ఎమ్మెల్సీ చంద్రశేఖరరావు ప్రాజెక్టుకు రూ.40 వేల కోట్లు వ్యయం అవుతుందని అంటున్నారని.. అంత డబ్బులు కేంద్రం ఇస్తుందా? అని అడిగితే నాటి సీఎం ఎగతాలి చేయడంతో అసెంబ్లీలో రికార్డయింది.

అంటే రూ.20,398కోట్లు మాత్రమే పోలవరం ప్రాజెక్టుకు ఇస్తామని కేంద్రం స్పష్టం చేసినప్పుడు నాడు బాబు ఎందుకు మౌనం దాల్చారు. నాడు చంద్రబాబు పోలవరంలో అవినీతికి అస్కారం కల్పించేలా ప్రతిపాదనలు చేసినట్లు తాజా ప్రభుత్వం ఆధారాలతో బయటపెట్టేందుకు సిద్ధమవుతుంది.