పింక్ బాల్ టెస్ట్ లో స్మృతి మందానా చరిత్ర

పింక్ బాల్ టెస్ట్ లో స్మృతి మందానా చరిత్రక్విన్స్ ల్యాండ్ : భారత మహిళా ఓపెనర్ స్మృతి మందానా చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ టీంతో జరుగుతున్న ఏకైక డేనైట్ టెస్ట్ రెండో రోజు ఆమె సెంచరీ బాదింది. దీంతో పింక్ బాల్ టెస్ట్ లో భారత మహిళల జట్టు తరపున సెంచరీ చేసిన తొలి బ్యాటర్ గా ఆమె నిలిచింది. 171 బంతుల్లో ఆమె మూడంల స్కోరును అందుకుంది. వాస్తవానికి మొదటి రోజే ఆమె సెంచరీ చేసేలా కనిపించినా, వర్షం అడ్డుపడటంతో కేవలం 44 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.

దీంతో ఆమె 80 పరుగులతో నాటౌట్ గా నిలిచింది. రెండో రోజు అదే దూకుడు కొనసాగించినప్పటికీ ఆట ప్రారంభమైన కాసేపటికే సెంచరీ మార్క్ అందుకుంది. ఆమె సెంచరీలో 19 ఫోర్లు, 1 సిక్స్ ఉండటం విశేషం. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ లో ఆమె కొన్ని కళ్లు చెదిరే ఆఫ్ సైడ్ షాట్లతో అలరించింది. ఈ టెస్ట్ మ్యాచ్ కోసం గత 3 నెలలుగా ఆమె పింక్ బాల్ ను దగ్గర పెట్టుకొని ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేస్తున్నట్లు మొదటి రోజు ఆట తర్వాత మందాన చెప్పింది. అందుకే తాను ఆ బంతికి అలవాటు పడినట్లు పేర్కొంది.