అవసరాన్ని బట్టి పొత్తులుంటాయన్న బాబు

అవసరాన్ని బట్టి పొత్తులుంటాయన్న బాబుఅమరావతి : ఏపీలో పరిస్థితులను బట్టి పొత్తులుంటాయని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరాన్ని బట్టి ఇరుపక్షాల సమ్మతం మేరకు పొత్తులు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. కుప్పం నియోజకవర్గంలో కొనసాగుతున్న తన రెండో రోజు పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు.

చరిత్ర గురించి వైసీపీకి తెలియదని ఎద్దేవా చేశారు. ఒక్క ఛాన్స్ అంటూ ప్రచారం చేశారు. గెలుపొందారు. రాష్ట్రాన్ని నాశనం చేశారు. వైసీపీ నేతలకు ప్రజలు త్వరలో తగిన బుద్ధి చెబుతారని చంద్రబాబు హెచ్చరించారు. అదే వారికి లాస్ట్ ఛాన్స్ అని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. పొత్తులు పెట్టుకున్నప్పుడు గెలిచాం, ఓటమి పాలయ్యామని గుర్తు చేశారు.