యాదాద్రిని దర్శించుకున్న కేసీఆర్ దంపతులు 

యాదాద్రిని దర్శించుకున్న కేసీఆర్ దంపతులు

వరంగల్ టైమ్స్, యాదాద్రి భువనగిరి జిల్లా : యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో సీఎం కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానాలయంలో స్వామి వారిని కేసీఆర్ దంపతులు దర్శించుకున్నారు. అనంతరం కేసీఆర్ దంపతులను అర్చక బృందం ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందచేశారు. ఆ తర్వాత రామలింగేశ్వర స్వామి ఆలయ ఉద్ఘాటన క్రతువుల్లో సీఎం కేసీఆర్, ఆయన సతీమణి శోభ పాల్గొన్నారు.యాదాద్రిని దర్శించుకున్న కేసీఆర్ దంపతులు మహా పూర్ణాహుతి, మహాకుంభాభిషేకం పూజల్లో పాల్గొన్నారు. పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామివారి చేతుల మీదుగా ఉద్ఘాటన క్రతువును నిర్వహించారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ ఉన్నారు.యాదాద్రిని దర్శించుకున్న కేసీఆర్ దంపతులు