చైనాలో డేంజర్ యాక్సిడెంట్.. 16 మంది మృతి 

చైనాలో డేంజర్ యాక్సిడెంట్.. 16 మంది మృతి

వరంగల్ టైమ్స్, ఇంటర్నెట్ డెస్క్ : చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హునాన్ ప్రావిన్స్ లో పలు వాహనాలు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో 16 మంది మృతి చెందారు. హునాన్ ప్రావిన్స్ లోని చాంగ్ షాఖా నగరంలో షుచాంగ్-గ్వాంగ్ జౌ హైవేపై 49 వాహనాలు ఢీకొన్నాయి. వాహనాలు వేగంగా ఢీకొట్టుకోవడంతో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

ఈ ప్రమాదంలో 16మంది మృతి చెందగా, 66 మంది గాయపడ్డారని స్థానిక ట్రాఫిక్ పోలీసు శాఖ తెల్పింది. పలువురు తీవ్రంగా గాయపడగా, వారందరినీ ఆస్పత్రులకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఇందులో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం గురించి సమాచారం అందిన తర్వాత ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ టీంను సంఘటనా స్థలానికి పంపినట్లు మంత్రిత్వ శాఖ తెల్పింది.