కొమురవెల్లికి పోటెత్తిన భక్తులు

కొమురవెల్లికి పోటెత్తిన భక్తులుసిద్ధిపేట జిల్లా : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి జాతర అంగరంగ వైభవంగా సాగుతుంది. వేడుకల్లో భాగంగా రెండో ఆదివారం ( లష్కర్ వారం ) సందర్భంగా వేలాది మంది భక్తులు తరలివచ్చారు. గంగరేణిచెట్టు వద్ద పట్నాలు వేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలు గతవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. కరోనా నిబంధనల మధ్య అధికారులు భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు.