ఫుట్ పాత్ లపై వ్యాపారాలు వద్దు: మంత్రి గంగుల

ఫుట్ పాత్ లపై వ్యాపారాలు వద్దు: మంత్రి గంగులకరీంనగర్ జిల్లా : కరీంనగర్ సిటీలో జరిగిన ప్రమాద ఘటన దురదృష్టకరమని రాష్ట్ర పౌరసరఫరాల, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మృతి చెందిన నలుగురి కుటుంబాలకు డబుల్ బెడ్రూంలు మంజూరు చేస్తామని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి గంగుల మాట్లాడారు. ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి గంగుల కమలాకర్ గతంలో ఎన్నోసార్లు ఫుట్ పాత్ లపై వ్యాపారాలు వద్దని చెప్పినప్పటికీ, వారు వినక పోవడంతో విలువైన ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వీధి వ్యాపారులు, అధికారులు సూచించిన ప్రదేశాల్లో వ్యాపారాలు చేసుకోవాలని ఆయన సూచించారు. మృతుల కుటుంబాలకు డబల్ బెడ్రూమ్ ఇల్లు, క్షతగాత్రులకు రూ.50 వేలు ఆర్థిక సహాయం అందిస్తామన్నారు.