రష్యా దాడుల్లో జర్నలిస్టు మృతి 

రష్యా దాడుల్లో జర్నలిస్టు మృతి

వరంగల్ టైమ్స్, ఇంటర్నెట్ డెస్క్ : ఉక్రెయిన్ -రష్యా దాడులు తారా స్థాయికి చేరుకున్నాయి. రష్యన్ బలగాలు బాంబులు, మిస్సైల్ అటాక్స్ చేస్తూ ఉక్రెయిన్ పౌరులను బలి తీసుకుంటున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటికే వేల సంఖ్యలో సైనికులు, పౌరులు మృత్యువాతపడ్డారు. రష్యా దాడుల్లో అమెరికాకు చెందిన జర్నలిస్ట్ బ్రెంట్ రెనౌడ్ మృతి చెందాడు. రష్యా దాడుల్లో జర్నలిస్టు మృతి రష్యా దాడులపై ఉక్రెయిన్ లో గ్రౌండ్ లెవల్ లో రిపోర్టింగ్ చేస్తున్న సమయంలో జరిగిన కాల్పుల్లో అతను మరణించినట్లు ఉక్రెయిన్ సైనికాధికారులు తెలిపారు. కాగా బ్రెంట్ , న్యూయార్క్ టైమ్స్ కు చెందిన జర్నలిస్టుగా అధికారులు గుర్తించారు. వారి కాల్పుల్లో మరో ఇద్దరు జర్నలిస్టులు తీవ్రంగా గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.

జర్నలిస్టు మృతిపై పలు పాత్రికేయ సంఘాలు సంతాపం తెలిపాయి. ఇదిలా ఉండగా, ఉక్రెయిన్ లో రష్యన్ బలగాల దాడులు కొనసాగుతున్న క్రమంలో భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ లో ఉన్న భారత రాయబార కార్యాలయన్ని తాత్కాలికంగా పోలాండ్ కు తరలిస్తున్నట్లు ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించింది.