అకాల వర్షంతో రైతులు, భక్తులు ఆగమాగం

అకాల వర్షంతో రైతులు, భక్తులు ఆగమాగం

అకాల వర్షంతో రైతులు, భక్తులు ఆగమాగంవరంగల్ టైమ్స్, శ్రీకాకుళం జిల్లా : శ్రీకాకుళం జిల్లాలో ఉదయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. జిల్లా వ్యాపంగా మబ్బులు అలుముకున్నాయి. శ్రీకాకుళం, టెక్కలి రెవెన్యూ డివిజన్ల పరిధిలోని పలు ప్రాంతాలలో ఓ మోస్తారు వర్షం పడింది. ఆ తరువాత కూడా అక్కడక్కడ చిరు జల్లులు పడుతున్నాయి. వర్షానికి శివరాత్రి సందర్బంగా ఆలయాల క్యూలైన్లలోని భక్తలు ఇబ్బందులు పడ్డారు. ఇది చలికాలం , పైగా ఇప్పుడే ఎండలు ముదురుతున్నాయి. దీనికి తోడు ఈ సీజన్‌లో అకాల వర్షం అందర్నీ ఆశ్చర్యపరిచింది. మరో వైపు అకాల వర్షానికి రైతులు ఆందోళన చెందుతున్నారు.

జిల్లాలోని కొన్ని చోట్ల మినుములు,పెసలు, ఉలవలు వంటి పంటలు కోతలు పూర్తయ్యి పొలాల్లో ఎండుతున్నాయి. ఇకపోతే రానున్న వేసవికాలంలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎల్ నినో, లా నినో ఎఫెక్ట్‌తో ఈ ఎండాకాలంలో 45 నుంచి 48 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. వడగాల్పలు భారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. పగటి ఉష్ణోగ్రతలు దారుణంగా పెరగడానికి కాలుష్యం పెరుగదలే కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.