మేడారం వచ్చే భక్తుల కోసం హెలీ రైడ్

మేడారం వచ్చే భక్తుల కోసం హెలీ రైడ్వరంగల్ టైమ్స్, ములుగు జిల్లా: మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం పర్యాటక శాఖ హెలీ రైడ్ ను ఏర్పాటు చేస్తున్నది. ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశాల మేరకు మేడారం జాతరకు ఈ ప్రత్యేక సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు జిల్లా పర్యాటక శాఖ అధికారి యం.శివాజీ తెలిపారు. బెంగుళూరుకు చెందిన తుంబి ఎవియేషన్ సంస్థ హెలీ కాప్టర్ ను ఫిబ్రవరి 13 ఆదివారం నుంచి అందుబాటులో వుంచుతుంది.

హనుమకొండ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ నుండి మేడారం వరకు ప్రయాణానికి గాను(up and down)ఒక్కొక్కరికి రూ. 19,999=00 గా ఛార్జ్ చేయనున్నట్లు తెలిపారు. మేడారం జాతరలో ఏరియల్ వ్యూ రైడ్ కోసం ఒక్కొక్కరికి రూ. 3700=00 ఛార్జ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. మేడారం జాతరకు వచ్చే భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని ములుగు కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. హెలీ రైడ్ టికెట్ బుకింగ్, ఇతర వివరాల కోసం 9400399999, 9880505905 ఫోన్ లో లేదా [email protected] ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు.