క్రికెట్​ కు పార్థివ్​ వీడ్కోలు

క్రికెట్​ కు పార్థివ్​ వీడ్కోలున్యూఢిల్లీ: టీమిండీయా వికెట్​ కీపర్​ పార్థివ్​ పటేల్ అన్ని ఫార్మాట్ల క్రికెట్​కు వీడ్కోలు పలికారు. పదిహేడేళ్ల వయస్సులోనే అంతర్జాతీయ అరంగ్రేటం చేసిన ఆయన 18 సంవత్సరాల కెరీర్​కు బుధవారం గుడ్​బై చెప్పాడు. రిటైర్మెంట్​ను ప్రకటిస్తూ ట్విట్టర్​లో భావోద్వేగ పోస్టు పెట్టాడు. ఇంతకాలం తనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు చెబుతున్నానని, ముఖ్యంగా తనపై నమ్మకముంచిన సౌరవ్​ గంగూలీకి ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ రాశాడు. ప్రతిభ పరంగా పార్థివ్​ మంచి వికెట్​ కీపర్​ బ్యాట్స్​మెన్​ అయినా.. ధోనీ హయాంలో ఆడాడు కాబట్టే భారతజట్టులో అవకాశాలు రాలేదని ఎందరో మాజీలు చాలాసార్లు అభిప్రాయం వ్యక్తపరిచారు. అయితే ధోనీ కన్నా మెరుగ్గా ఆడలేకపోయినందువల్లే చాన్స్​ దక్కలేదని పార్థివ్​ తన క్రీడాస్ఫూర్తిని చాటుకున్నాడు. 2002 ఆగస్టు 8న గంగూలీ సారథ్యంలో 17 ఏళ్ల వయస్సులోనే ఇంగ్లండ్​పై పార్థివ్​ టీమిండియాలో టెస్టు అరంగ్రేంటం చేశాడు. చివరగా 2018 జనవరిలో సౌతాఫ్రికాతో టెస్టు ఆడాడు. అంతర్జాతీయ స్థాయిలో సెంచరీ చేయకపోయినా దేశవాళీ క్రికెట్​లో దిగ్గజంగా పార్థివ్​ పేరు తెచ్చుకున్నాడు. 194 ఫస్ట్​క్లాస్​ మ్యాచ్​లు ఆడిన పటేల్​ 43 సగటు, 27 శతకాలతో 11,240 పరుగులు తీశాడు. ఐపీఎల్​లోనూ దక్కన్​ చార్జర్స్​, ముంబై, చెన్నై , బెంగుళూరు తరపున 13 సీజన్లు ఆడాడు.