భారత్, దక్షిణాఫ్రికా టెస్ట్..వర్షంతో 2వ రోజు ఆలస్యం

భారత్, దక్షిణాఫ్రికా టెస్ట్..వర్షంతో 2వ రోజు ఆలస్యంసెంచూరియన్ : ఇండియా, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ 2వ రోజు వర్షం కారణంగా ఆలస్యమవుతోంది. గ్రౌండ్ పై సూపర్ సోపర్లు వర్షపు నీటిని తొలగిస్తున్నాయి. పిచ్ పై కవర్స్ కప్పారు. నేడు ఉదయం సెంచూరియన్ లో భారీ వర్షం కురిసింది. దీంతో పిచ్ తడిగా మారింది. స్థానిక కాలమానం ప్రకారం 11.30 నిమిషాలకు పిచ్ ను అంపైర్లు పరిశీలించనున్నారు.

ప్రస్తుతం వర్షం నిలిచిపోయింది. త్వరలో మ్యాచ్ ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి. తొలి రోజు ఇండియా 3 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఓపెనర్ కేఎల్ రాహుల్ 122, రహానే 40 రన్స్ తో క్రీజ్ లో ఉన్నారు.