కర్ణాటకలో హిజాబ్ వ్యవహారం రాజుకుంటోంది

కర్ణాటకలో హిజాబ్ వ్యవహారం రాజుకుంటోందివరంగల్ టైమ్స్, ఇంటర్నెట్ డెస్క్: కర్ణాటకలో హిజాబ్ వ్యవహారం రాజుకుంటోంది. విద్యార్థుల రెండు వర్గాలుగా విడిపోయారు. స్కూళ్లు, కాలేజీల్లో తప్పకుండా యూనిఫాం పాటించాలని బస్వరాజ్ బొమ్మై సర్కార్ స్పష్టం చేసింది. హిజాబ్ కు పోటీగా కాషాయకండువా ధరించారు విద్యార్థులు. దీంతో రెండు వర్గాల మధ్య పరస్పరం వాగ్వాదం నెలకొంది. కాగా నేడు హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టులో విచారణ జరుగనుంది. దీంతో కోర్టు ఏం చెబుతుందన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. కర్ణాటకలో హిజాబ్ రగడ కొనసాగుతూనే ఉంది. ఉడుపి ఎంజీఎం కాలేజీ విద్యార్థుల మధ్య ఘర్షణ నెలకొంది. హిజాబ్ మహిళలకు జై భీం విద్యార్థులు మద్దతు ఇచ్చారు.

ఐతే కొంత మంది మాత్రం తమ మతాచారాలకు అనుగుణంగా హిజాబ్ ధరించి స్కూళ్లకు, కాలేజీలకు వస్తున్నారు. మరో వర్గం విద్యార్థి, విద్యార్థినులు కాషాయ కండువాలతో కాలేజీలకు హాజరవుతున్నారు. దీంతో విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయారు. పోటాపోటీగా నినాదాలు, నిరసనలు తెలపడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. ఐతే ఇలా వచ్చే వారిని స్కూళ్లు, కాలేజీల యజమాన్యాలు తరగతులకు అనుమతించడం లేదు. దీంతో గేటు ముందే ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు. ఉడిపి జిల్లాలో ప్రారంభమై ఈ వివాదం మెల్లిగా, బెలగావి, శివమొగ్గ, కొప్పెల ప్రాంతాలకు కూడా విస్తరించింది.