టీఎస్ బీపాస్ ద్వారానే నిర్మాణాలకు అనుమతి

టీఎస్ బీపాస్ ద్వారానే నిర్మాణాలకు అనుమతి

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : పట్టణాల్లో ఇండ్ల నిర్మాణాలకు టీఎస్ బీపాస్ ద్వారా మాత్రమే నిర్మాణాలకు అనుమతి ఇవ్వాలని మంత్రి కేటీఆర్ సూచించారు. వరంగల్ , హనుమకొండ జిల్లాలకు సంబంధించిన మున్సిపాలిటీల అభివృద్ధిపై హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ప్రతీ మున్సిపాలిటీలో వెజ్, నాన్ వెజ్ మార్కెట్లతో పాటు వైకుంఠధామాలు నిర్మించాలని కేటీఆర్ ఆదేశించారు. గ్రీన్ బడ్జెట్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.టీఎస్ బీపాస్ ద్వారానే నిర్మాణాలకు అనుమతిఆధునిక దోబీ ఘాట్లు నిర్మాణం కావాలని కేటీఆర్ అన్నారు. బయో మైనింగ్ ద్వారా డంప్ యార్డులో చెత్త నిర్వీర్యం చేయాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు కేటీఆర్ సూచించారు. ప్రతీ మున్సిపాలిటీలో మానవ వ్యర్థాల శుద్దీకరణ ప్లాంట్ నిర్మించాలన్నారు. పేదలకు రూపాయి నల్లా కనెక్షన్ ఇవ్వాలని సూచించారు. అన్ని పట్టణాల్లో మాస్టర్ ప్లాన్ పూర్తి కావాలని ఆదేశించారు. డిజిటల్ డోర్ నంబరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు.