బీఆర్ఎస్ కార్యాలయాన్ని సందర్శించిన నేతలు 

బీఆర్ఎస్ కార్యాలయాన్ని సందర్శించిన నేతలు

వరంగల్ టైమ్స్, ఢిల్లీ : ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఆ పార్టీ నాయకులు ఎర్రబెల్లి దయాకర్ రావు, బడుగు లింగయ్య యాదవ్, నామా నాగేశ్వరరావు, బీపీ పాటిల్ సందర్శించారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా రేపు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని బీఆర్ఎస్ నేత బడుగు లింగయ్య యాదవ్ తెల్పారు. జాతీయ పార్టీ ఏర్పాటుతో తెలంగాణ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారని అన్నారు. భారత దేశంలో ఏ సీఎం తీసుకురాని వినేత్న సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని కొనియాడారు. దేశ ప్రజల శ్రేయస్సు కోసమే బీఆర్ఎస్ పార్టీ స్థాపించారని అన్నారు. తెలంగాణ అభివృద్ధితో పాటు ఇకనుంచి దేశ అభివృద్ధి కూడా తమ పార్టీ నినాదమని చెప్పారు.బీఆర్ఎస్ కార్యాలయాన్ని సందర్శించిన నేతలు తమ పార్టీ కార్యాలయం ఈ నెల 14 నుంచి అందుబాటులో ఉంటుందని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు తెల్పారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా బీఆర్ఎస్ పార్టీ స్థాపించామన్నారు. రైతు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. బీఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించేలా ప్రయత్నాలు చేస్తున్నామని, దేశ ప్రజల శ్రేయస్సు కోసమే బీఆర్ఎస్ పార్టీ అని వివరించారు. పార్టీ కార్యాలయం ఓపెనింగ్ కి కొంతమంది జాతీయ నాయకులను ఆహ్వానించామని ఎంపీ నామా నాగేశ్వరరావు తెల్పారు.