అగ్రిగోల్డ్​ కీలక నిందితుల అరెస్టు

అగ్రిగోల్డ్​ కీలక నిందితుల అరెస్టు

అమరావతి : అగ్రిగోల్డ్ కేసులో ముగ్గురు కీలక నిందితులను ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టర్​ బుధవారం అరెస్టు చేసింది.మనీలాండరింగ్ అభియోగాలపై అగ్రిగోల్డ్ ఛైర్మన్ అవ్వా వెంకట రామారావు, డైరెక్టర్లు అవ్వా వెంకట శేషు నారాయణ రావు, హేమ సుందర ప్రసాద్​ను ఈడీ అరెస్టు చేసింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో సుమారు 9 లక్షల మంది నుంచి రూ. 6,380 కోట్లు మోసానికి పాల్పడినట్టు అగ్రిగోల్డ్​పై అభియోగాలు ఉన్నాయి. ఏపీ సీఐడీ దాఖలు చేసిన కేసులు, ఛార్జిషీట్ల ఆధారంగా హైదరాబాద్​లో ఈడీ విభాగం మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు దర్యాప్తు చేస్తోంది. కుంభకోణం ద్వారా కూడబెట్టుకున్న ఆస్తులపై ఈడీ ఆరా తీస్తోంది. ఈ క్రమంలో రామారావు, శేషు నారాయణ రావు, హేమ సుందర వరప్రసాద్​ను ప్రశ్నించిన ఈడీ వారిని అరెస్టు చేసింది.