ఎమ్మెల్సీల నియామకాలపై నోటీసులు

ఎమ్మెల్సీల నియామకాలపై నోటీసులు

 

హైదరాబాద్​ : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకాలపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. గోరేటి వెంకన్న, సారయ్య, దయానందల నియామకాలను ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా నియామకం చేపట్టారని గోపాల్ అనే వ్యక్తి పిటిషన్‌లో పేర్కొన్నారు . తన పేరును రెండుసార్లు గవర్నర్ ప్రతిపాదించినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం బేఖాతరు చేసిందన్నారు. ఎమ్మెల్సీల నియామకాలపై నోటీసులురాష్ట్ర మంత్రివర్గ సిఫార్సులను ఆమోదించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. దీనిపై నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. చీఫ్ సెక్రటరీ, ఎమ్మెల్సీలు గోరేటి వెంకన్న, సారయ్య, దయానందకు నోటీసులు జారీ చేసింది.