మెడికో ప్రీతిని పరామర్శించిన మంత్రి హరీశ్ రావు

మెడికో ప్రీతిని పరామర్శించిన మంత్రి హరీశ్ రావు

మెడికో ప్రీతిని పరామర్శించిన మంత్రి హరీశ్ రావువరంగల్ టైమ్స్, హైదరాబాద్ : నిమ్స్ లో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థిని ప్రీతిని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు శుక్ర‌వారం పరామర్శించారు. రెండు రోజుల జిల్లా ప‌ర్య‌ట‌న ముగించుకొని శుక్ర‌వారం రాత్రి హైద‌రాబాద్ కు వ‌చ్చిన మంత్రి నేరుగా నిమ్స్‌కు వెళ్లి ప్రీతి ఆరోగ్యంపై స‌మీక్షించారు. ఆమెకు అందిస్తున్న వైద్యం గురించి, నిమ్స్ ఇంఛార్జి డైరెక్టర్, చికిత్స అందిస్తున్న ప్రత్యేక వైద్య బృందాన్ని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాల‌ని, అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని వైద్యుల‌ను ఆదేశించారు.

ప్రీతి కుటుంబ సభ్యులతో మాట్లాడిన మంత్రి హరీష్ రావు వారిని ఓదార్చి, ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భ‌రోసా ఇచ్చారు. విచారణ పూర్తి నిష్పాక్షికంగా జ‌రుగుతుంద‌ని, దోషులు ఎంత‌టివారైనా క‌ఠినంగా శిక్షిస్తామ‌ని హామీ ఇచ్చిన మంత్రి హ‌రీశ్ రావు.