భద్రకాళి బండ్ పై సందడి చేసిన మంత్రులు,చీఫ్ విప్

భద్రకాళి బండ్ పై సందడి చేసిన మంత్రులు,చీఫ్ విప్హనుమకొండ జిల్లా : సర్వాంగసుందరంగా తీర్చిదిద్దబడి పర్యాటకులను ఆకర్షిస్తున్న వరంగల్ భద్రకాళి బండ్ ని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, వి. శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు సందర్శించారు. భద్రకాళి బండ్ పై నడుస్తూ మంత్రులు సందడి చేశారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో బండ్ అందాలను తిలకించారు. బండ్ పై ఉన్న ప్రతీ భాగాన్ని మంత్రులు పరిశీలించారు. కాసేపు వాకింగ్ చేసి, కాసేపు సేద తీరి బండ్ అందాలపై ముచ్చటించుకున్నారు. భద్రకాళి బండ్ పై సందడి చేసిన మంత్రులు,చీఫ్ విప్సందర్శకులతో మాట్లాడారు. బండ్ ఎలా ఉంది? ఇంకా ఏమైనా మార్పులు, చేర్పులు చేయాలా? ఎలాంటి ఏర్పాట్లు కోరుకుంటున్నారు? వంటి ప్రశ్నలు వేసి, ఆరా తీశారు. తగు విధంగా అధికారులకు సూచనలు చేశారు. మరింతగా భద్రకాళి బండ్ ను తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు మంత్రులు పలు సూచనలు చేశారు.