మహాత్మునికి సీఎం కేసీఆర్ నివాళి

మహాత్మునికి సీఎం కేసీఆర్ నివాళిహైదరాబాద్ : శాంతి, సహనాలను ప్రదర్శిస్తూ ఎన్ని కష్టాలెదురైనా, ప్రజాస్వామిక పద్దతుల్లో ఉన్నతమైన లక్ష్యాలను సాధించిన జాతిపిత మహాత్మా గాంధీ కార్యాచరణ ఆదర్శనీయమని సీఎం కేసీఆర్ అన్నారు. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా సీఎం ఆయనకు నివాళి అర్పించారు. సత్యం, అహింసా మార్గాలే ఆయుధంగా దేశానికి స్వాతంత్ర్యం సాధించిన మహాత్ముడి స్ఫూర్తి గొప్పదన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించడంలో గాంధీజీ అనుసరించిన శాంతియుత విధానాలు ఇమిడి వున్నాయని సీఎం తెలిపారు. గాంధీజీ అనుసరించిన శాంతి, సౌభ్రాతృత్వం, లౌకిక విధానాన్ని అవలంబిస్తూ నూతన తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో సాగుతున్నదని సీఎం అన్నారు.