దేశాభివృద్ధికి కొత్త ఎజెండా అవసరం : కేసీఆర్

దేశాభివృద్ధికి కొత్త ఎజెండా అవసరం : కేసీఆర్వరంగల్ టైమ్స్, ముంబై : ఎన్సీపీ అధినేత శరద్ పవాత్ సీఎం కేసీఆర్ సమావేశం ముగిసింది. తాజా రాజకీయాలపై వారు తమ తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. బీజేపీ సర్కారు వివక్ష, రాష్ట్రాలపై పెత్తనం లాంటి విషయాలపై చర్చించారు. మోడీ సర్కారు వివక్ష పాలనపై గట్టిగా పోరాడాలని నిర్ణయించారు. దేశాభివృద్ధికి కొత్త ఎజెండా రూపొందించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఇద్దరు నేతలు అభిప్రాయపడ్డారు. సమావేశం అనంతరం శరద్ పవార్ నివాసం బయట మీడియాలో ఇరువురు మాట్లాడారు.

కేసీఆర్ మాట్లాడుతూ ‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శరద్ పవార్ ఇచ్చిన మద్దతును మర్వలేం. 1969 నుంచి తెలంగాణ పవార్ మద్దతుగా ఉన్నారు. 75 ఏండ్ల స్వేచ్ఛా భారతంలో సమస్యలు అలాగే ఉన్నాయి. అభివృద్ధి కుంటుపడింది. దేశ అభివృద్ధికి కొత్త ఎజెండా తేవాల్సిన సమయం వచ్చింది. దేశం సరైన రీతిలో ముందుకు పోవడం లేదు. త్వరలో భావసారుప్యం గల పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నాం. అందరం కలిసి దేశాభివృద్ధికి చేపట్టాల్సిన ఎజెండాపై చర్చించి భవిష్యత్ కార్యాచరణను ప్రజల ముందుంచుతాం. దేశంలో విశేష అనుభవం ఉన్న నేత శరద్ పవార్. మోడీ సర్కారుపై చేపట్టిన తమ పోరాటానికి శరద్ పవార్ మద్దతుగా నిలిచి ఆశీర్వదించారు.’’అని కేసీఆర్ చెప్పారు.

శరద్ పవార్ మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం దేశంలో అనేక సమస్యలు పీడిస్తున్నాయి. నిరుద్యోగం, ఇంధన ధరలు చెప్పుకుంటూ పోతే మోడీ సర్కారు అన్ని రంగాల్లో విఫలమైంది. తెలంగాణ అనేక సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు అవుతున్నాయి. దేశ అభివృద్ధికి కేసీఆర్ లాంటి నేతలు అవసరం. కేసీఆర్ తో కలిసి పనిచేస్తాం.’’అని అన్నారు.