భారత్ లో కొత్తగా 7081 కరోనా కేసులు

భారత్ లో కొత్తగా 7081 కరోనా కేసులున్యూఢిల్లీ : భారత్ లో కొత్తగా 7081 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,47,40,275కు పెరిగింది. ఇందులో 4,77,422 మంది మరణించారు. 3,41,78,940 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 83,913 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక, గత 24 గంటల్లో కొత్తగా 264 మంది మరణించారు, 7469 మంది కరోనా నుంచి బయటపడ్డారు.

అయితే ఇప్పటివరకు 1,37,46,13,252 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. నిన్న ఒక్క రోజే 76,54,466 మందికి కరోనా టీకా వేశామని పేర్కొంది. కాగా, మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.24 శాతమని, రికవరీ రేటు 98.38 శాతంగా ఉందని, మరణాల శాతం 1.37 శాతమని వెల్లడించింది. డిసెంబర్ 18 వరకు దేశవ్యాప్తంగా 66,41,09,365 నమూనాలను పరీక్షించామని, ఇందులో 12,11,977 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.