మొక్కల పెంపకం ప్రతి ఒక్కరి బాధ్యత: ఎస్పీ సంగ్రాం

మొక్కల పెంపకం ప్రతి ఒక్కరి బాధ్యత: ఎస్పీ సంగ్రాంజయశంకర్, భూపాలపల్లి జిల్లా : మొక్కల పెంపకం ప్రతి ఒక్కరి బాధ్యత అని ములుగు ఎస్పీ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇన్​చార్జి ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ పాటిల్ అన్నారు. శుక్రవారం కాటారం పోలీస్ స్టేషన్​లో ఎస్పీ రాజ్యసభసభ్యుడుసంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటారు. అనంతరం మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా సవాలు విసిరారు. మొక్కలను నాటడం వల్ల వాతావరణంలో సమతుల్యత ఏర్పడుతుందని అన్నారు. వాతావరణ కాలుష్యం తగ్గాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఏటూరు నాగారం ఏఎస్పీ గౌస్ అలం, వీర్దావల్ ఖడే, ఒలంపిక్ స్విమ్మర్, మహారాష్ట్ర డిప్యూటీ కలెక్టర్ , డీఎస్పీ బోనాల కిషన్ పేర్లను నామినేట్ చేశారు. ఈ కార్యక్రమంలో కాటారం డీఎస్పీ కిషన్ సీఐ హతీరాం, ఎస్సైలు పాల్గొన్నారు.