మందకోడిగా జీహెచ్ఎంసీ పోలింగ్

మందకోడిగా జీహెచ్ఎంసీ పోలింగ్

హైదరాబాదీలు ఇప్పటివరకు ఓటు వేసేందుకు ఆసక్తి చూపడంలేదు. ఉ. 7 గం. లకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా, తొలి రెండు గంటలల్లో మందకొడిగానే సాగింది. ఎప్పటిలాగే ఇప్పుడు కూడా ఓటింగ్‌కు గ్రేటర్ వాసులు ఆసక్తి చూపడంలేదు. ఇక ఓటుహక్కు వినియోగించుకుంటున్న అధికారులు, ప్రముఖులు మాత్రం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని పిలుపునిస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో పోలింగ్ 50 శాతం మించలేదు. ఐదేళ్ల పాటు నగర భవిష్యత్‌ను ఎవరికి అప్పగించాలో నిర్ణయించే ఎన్నికలను ఓటర్లు లైట్ తీసుకుంటున్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చి ఓటేసేందుకు ఆసక్తి చూపలేదు. సాధారణ ఎన్నికల్లో కంటే గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగా ఉంటుందంటే, పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గత రెండు ఎన్నికల్లో పోలింగ్ జరిగిన తీరు చూస్తే, ఓటర్ల నిరాసక్తత ఏంటో తెలుస్తుంది. 2009లో 42.92 శాతం ఓటింగ్ జరిగింది. 2016లో అది కేవలం మూడు శాతం పెరిగింది. గత ఎన్నికల్లో 45.27 శాతం మాత్రమే ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇప్పటికైనా హైదరాబాదీలు కదిలి, కనీసం 50 శాతానికి పైగానైనా ఓటు హక్కు వినియోగించుకుంటారేమో చూడాలి.