రూ.100 నాణేన్ని విడుద‌ల చేసిన ప్ర‌ధాని మోదీ

రూ.100 నాణేన్ని విడుద‌ల చేసిన ప్ర‌ధాని మోదీన్యూఢిల్లీ: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ల‌క్నో యూనివ‌ర్సిటి ప్రారంభ‌మై నేటికి స‌రిగ్గా వందేండ్లు పూర్త‌యింది. ఈ నేప‌థ్యంలో ఆ యూనివ‌ర్సిటీ 100వ వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వహించారు. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ల‌క్నో యూనివ‌ర్సిటీ వందేండ్లు పూర్తి చేసుకున్నందుకు గుర్తుగా (జ్ఞాప‌కార్థం) ప్ర‌త్యేక పోస్ట‌ల్ స్టాంపును, రూ.100 నాణేన్ని ప్ర‌ధాని త‌న చేతులమీదుగా విడుద‌ల చేశారు.