పుతిన్ కి ప్రధాని మోడీ విజ్ఞప్తి

పుతిన్ కి ప్రధాని మోడీ విజ్ఞప్తివరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : ఉక్రెయిన్ -రష్యా ఉద్రిక్తతలపై గురువారం రాత్రి రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ప్రధాని మోడీ ఫోన్ లో మాట్లాడారు. ఇటీవల జరిగిన పరిణామాల గురించి పుతిన్ మోడీకి వివరించారు. ఈ క్రమంలో నాటో, రష్యా మధ్య నెలకొన్న భిన్నాభిప్రాయాలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని ప్రధాని సూచించారు. హింసాత్మక ఘటనలకు వెంటనే ముగింపు పలుకాలని విజ్ఞప్తి చేశారు. చర్చల ద్వారా పరిష్కార మార్గాలను అన్వేషించాలని సూచించారు.

ఉక్రెయిన్-రష్యా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని, ఈ విషయంలో భారత్ తటస్థ వైఖరి అవలంభిస్తుందని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. శాంతియుత మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నట్లు తెల్పింది. భారతీయులను సురక్షితంగా తీసుకురావడానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది.