అండర్ -19 వరల్డ్ కప్ లో టీమిండియా విజయం

అండర్ -19 వరల్డ్ కప్ లో టీమిండియా విజయంగయానా : అండర్ -19 వరల్డ్ కప్ లో టీమిండియా తన సత్తా చాటింది. సౌతాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. సౌతాఫ్రికాపై టీమిండియా 45 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 46.5 ఓవర్లలో 232 పరుగులు చేసి ఆలౌటైంది. సౌతాఫ్రికా టీం 45.4 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది.

భారత బౌలర్ రాజ్ భవా వేసిన బంతికి 45.4 ఓవర్ల వద్ద అఫ్ వ్యూ మయాండ..ధుల్ చేతికి బంతిని అందించి ఔటయ్యాడు. మయాండ పెవిలియన్ దారి పట్టడంతో భారత్ కు విజయం దక్కింది. రాజ్ భవా 6.4 ఓవర్లలో 47 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. టీంఇండియా జట్టులో సారథి యాష్ ధుల్ 82 పరుగులు చేయగా, తంబే 35, రషీద్ 31, నిషాంత్ 27 పరుగులు చేశారు. ఇక రఘు వన్షి 5, హర్నూర్ సింగ్ 1, రాజ్ భవా 13, దినేష్ బనా 7, విక్కీ 9 పరుగులు చేశారు.