ప్రారంభమైన తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

ప్రారంభమైన తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముందుగా జాతీయ గీతాలాపన చేసిన అనంతరం ఆర్థిక మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. అనంతరం డబ్జెట్ ప్రవేశ పెడుతున్నట్లు ఆయన ప్రకటించారు. కాగా 2 లక్షల 56 వేల కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం లక్ష 89 కోట్లు కాగా, క్యాపిటల్ వ్యయం 29,728 కోట్లుగా వివరించారు. అంతకు ముందు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా ఫిల్మ్ నగర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆర్ధిక మంత్రి హరీశ్ రావు ప్రత్యేక పూజలు చేశారు.ప్రారంభమైన తెలంగాణ బడ్జెట్ సమావేశాలుఅక్కడి నుంచి నేరుగా అసెంబ్లీకి బయల్దేరారు. అనంతరం బడ్జెట్ ప్రతులను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి అందించారు. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు, మండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిలు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. కాగా, బడ్జెట్ కు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికే ఆమోదం తెలిపింది. శాఖల వారిగా బడ్జెట్ ప్రతిపాదనలపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఏకగ్రీవంగా ఆమోదించింది.