సీఎం కేసీఆర్ కు థాంక్స్ చెప్పిన ఎమ్మెల్యే చల్లా

సీఎం కేసీఆర్ కు థాంక్స్ చెప్పిన ఎమ్మెల్యే చల్లా

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తన పరకాల నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి మంజూరు చేసి, శంకుస్థాపన చేసినందుకు సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. పరకాల నియోజకవర్గంలోని పరకాల పట్టణం నందు 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేసి శంకుస్థాపన పూర్తి చేసినందుకు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు ఆర్ధిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ని చల్లా ధర్మారెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. పరకాల ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. 100 పడకల ఆస్పత్రి అనేది పరకాల ప్రజల చిరకాల వాంఛ అని, ఆ కళను నెరవేర్చినందుకు ఎంతో రుణ పడి ఉంటామని తెలిపారు.సీఎం కేసీఆర్ కు థాంక్స్ చెప్పిన ఎమ్మెల్యే చల్లా