అది ఫేక్ వార్త : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

అది ఫేక్ వార్త : మంత్రి సబితా ఇంద్రారెడ్డిహైదరాబాద్ : రాష్ట్రంలో యథావిధిగా స్కూళ్లు నడపాల్సిందేనని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. స్కూళ్లు బంద్ అంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థలను కొనసాగించాలని ఇటీవల జరిగిన మంత్రి మండలి సమావేశంలో సీఎం కేసీఆర్ సైతం తెలిపారని ఆమె పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో పాఠశాలలకు సెలవు అంటూ వస్తున్న ప్రచారాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు నమ్మొద్దని సూచించారు. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించి, కరోనా వ్యాప్తిని కట్టడి చేద్దామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. విద్యా సంస్థల యాజమాన్యాలు అన్ని రకాల కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని మంత్రి సబితా సూచించారు.