ఏపీ నూతన గవర్నర్‌ ప్రమాణానికి ముహూర్తం ఖరారు

ఏపీ నూతన గవర్నర్‌ ప్రమాణానికి ముహూర్తం ఖరారు

ఏపీ నూతన గవర్నర్‌ ప్రమాణానికి ముహూర్తం ఖరారు

వరంగల్ టైమ్స్, కృష్ణా జిల్లా : ఆంధ్రప్రదేశ్‌ నూతన గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ను కేంద్రం నియమించిన సంగతి తెలిసిందే. ఈ నెల 24న గవర్నర్‌గా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు కొత్త గవర్నర్‌ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు రాజ్‌భవన్‌ వర్గాలు వెల్లడించాయి.మరోవైపు రేపు (బుధవారం) అబ్దుల్‌ నజీర్‌ ఏపీకి రానున్నారు. సతీసమేతంగా సాయంత్రం ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్ పోర్టుకి చేరుకుంటారాయన.