స్వగ్రామం చేరుకున్న మెడికో ప్రీతి పార్థివదేహం  

స్వగ్రామం చేరుకున్న మెడికో ప్రీతి పార్థివదేహం

స్వగ్రామం చేరుకున్న మెడికో ప్రీతి పార్థివదేహం  వరంగల్ టైమ్స్, జనగామ జిల్లా : మెడికో ప్రీతి పార్థివదేహం స్వగ్రామం జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్ని తండాకు చేరుకుంది. గత 5 రోజులుగా హైదరాబాద్ లోని నిమ్స్ లో చికిత్స పొందుతున్న ప్రీతి ఆదివారం రాత్రి 9.16 నిమిషాలకు మృతిచెందింది. అనంతరం ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో పోస్టుమార్టం పూర్తవడంతో వైద్యులు ఆమె భౌతికకాయాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు.

అనంతరం భారీ బందోబస్తు మధ్య పోలీస్ కాన్వాయ్ తో ప్రీతి భౌతికకాయాన్ని మొండ్రాయిలోని గిర్ని తండాకు తరలించారు. ఆమె మృతదేహం వద్ద కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు.