రాహుల్ గాంధీ నేటితరం జిన్నా: అస్సాం సీఎం

రాహుల్ గాంధీ నేటితరం జిన్నా: అస్సాం సీఎంవరంగల్ టైమ్స్,ఇంటర్నెట్ డెస్క్: అస్సాం సీఎం, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ.. రాహుల్ గాంధీని పాకిస్థాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నాతో పోల్చారు . అంతేకాకుండా రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ కుమారుడే అన్న విషయానికి రుజువులు చూపాలని బీజేపీ ఎప్పుడైనా అడిగిందా అంటూ హిమంత బిశ్వ శర్మ శుక్రవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరుసటి రోజు కాంగ్రెస్ నేతపై విరుచుకుపడ్డారు. రాహుల్ వేర్పాటు వాదిలా మాట్లాడుతున్నారని, ఆయన నేటితరం జిన్నా అంటూ వ్యాఖ్యానించారు. గువాహటిలో జరిగిన పార్టీ సమావేశంలో సీఎం హిమంత మాట్లాడారు. రాహుల్ ఉపయోగించే భాష, ఆయన మాటలు 1947కు ముందు జిల్లా మాట్లాడినట్లుగానే ఉంటున్నాయి. రాహుల్ గాంధీ నేటితరం జిన్నా మాదిరి కనిపిస్తున్నాడు అని అన్నారు. ఉత్తరాఖండ్ లో జరిగే ఎన్నికల కోసం బీజేపీ తరపున శుక్రవారం ప్రచారానికి వెళ్లిన ఆయన దేహ్రాడూన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో అస్సాం సీఎం మాట్లాడారు.

మన ఆర్మీ జవాన్లు శత్రు భూభాగంలో ఏదైనా చర్యకు వెళ్లడానికి నెల ముందు ప్లాన్ చేస్తారు. అవి వారి వ్యూహాత్మక చర్యలు. ఆపరేషన్, ఆ తర్వాత పత్రికా ప్రకటన అనంతరం ఈ చర్యల గురించి సమాజానికి తెలుస్తుంది. ఇలాంటి అంశాలపై రుజువులు అడిగితే, ఆర్మీ జవాన్లు అనుభవించే బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి’ అని అన్నారు. అందుకే తాను ఆ వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొన్నారు. ఇకపై ఆర్మీకి సంబంధించి ఎలాంటి ఆధారాలను కాంగ్రెస్ అడగబోదని ఎద్దేవా చేశారు. 2016లో పాకిస్థాన్ లోని ఉగ్ర స్థావరాలపై చేసిన మెరుపుదాడులకు సంబంధించి సాక్ష్యాలు చూపాలని అడగడం ద్వారా రాహుల్ సైనికుల వీరత్వాన్ని అనుమానించారంటూ హిమంత మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రతికూల రాజకీయాలు చేస్తోందని సీఎం హిమంత బిశ్వశర్మ ఆరోపించారు.