దేశంలోనే తెలంగాణ రాష్ట్రం టాప్ : ఎర్రబెల్లి

దేశంలోనే తెలంగాణ రాష్ట్రం టాప్ : ఎర్రబెల్లి

వరంగల్ టైమ్స్ , హైదరాబాద్ : రాష్ట్ర సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అద్భుతాలు సృష్టిస్తూ విజయ పథంలో పయనిస్తున్నదని, దేశంలోనే రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందనడానికి కేంద్ర గణాంకాలే నిదర్శనమని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తలసరి ఆదాయం వృద్ధి రేటులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందన్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి లోను గణనీయమైన వృద్ధి రేటు సాధించిందని అన్నారు. 2021- 2022 ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్ర తలసరి ఆదాయం 19.1% శాతం నమోదు కాగా జి.ఎస్.డి.పి లోను 19.46 % శాతం వృద్ధి రేటు నమోదు చేసిందని ఆయన పేర్కొన్నారు.

దేశంలోనే తెలంగాణ రాష్ట్రం టాప్ : ఎర్రబెల్లితెలంగాణ రాష్ట్రంలో 2014-2015 సంవత్సరంలో 1,24,104 రూపాయల తలసరి ఆదాయం ఉండగా, 2021 -22 ఆర్ధిక సంవత్సరానికి 2,78,833 రూపాయలకు పెరిగిందన్నారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి 2014-2015 లో కేవలం 5,05,849 కోట్ల రూపాయలు ఉండగా 2021-2022 సంవత్సరంలో 11,54,860 కోట్ల రూపాయలకు పెరిగిందన్నారు. విభజన సమస్యలు పరిష్కారం కానప్పటికీ కరోనా మహమ్మారి వాళ్ళ ఆర్ధిక వ్యవస్థ కుదేలైనప్పటికీ కేంద్రం నుండి ఎలాంటి సహకారం లేనప్పటికీ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాదిస్తుందని తెలిపారు. కేసీఆర్ అద్భుతమైన పాలన వల్ల ఇది సాధ్యమైందని మంత్రి అన్నారు.