భారత్ లో కొత్తగా 157 మందికి కొవిడ్ నిర్ధారణ 

భారత్ లో కొత్తగా 157 మందికి కొవిడ్ నిర్ధారణ

వరంగల్ టైమ్స్, హెల్త్ డెస్క్ : భారత్ లో గత 24 గంటల్లో 49,464 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా, 157 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం తెల్పింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,77,459 కి చేరింది. 4,41,43,342 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు.

ప్రస్తుతం దేశంలో 3,421 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.24 గంటల్లో ఒకరు మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,696 కి చేరింది. ఇక దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసులు 0.01 శాతంగా ఉండగా, రికవరీ రేటు 98.80 శాతం, మరణాల రేటు 1.19 శాతంగా ఉందని పేర్కొంది. ఇప్పటి వరకు 220.06 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.